టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై బయోపిక్ చిత్రాలు ఏవీ రాలేదు.  మొదటి సారిగా  అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది నిర్మాత స్వప్నా దత్.  ఇందులో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తుండగా సమంత ఓ కీలకపాత్ర పోషిస్తోంది.
Related image
దాదాపుగా సినిమా షూటింగ్ అంతా పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో సావిత్రి పాత్ర కోసం ముందు సమంతనే ఎంపిక చేశామని, కానీ ఆ పాత్రలో కొత్త వారిని తీసుకుంటే బావుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడంతో కీర్తిని ఫైనల్ చేశామని వెల్లడించింది. ఇందుకోసం సమంత సంతకం కూడా చేసేసింది.
Image result for mahanati posters
కానీ సావిత్రి పాత్రలో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకుడు నాగ్‌అశ్విన్ భావించడంతో.. ఆ పాత్ర కోసం కీర్తిసురేష్‌ని ఎంపిక చేసి సమంతకు చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చేశాం. అలాగే ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నప్పటి నుంచి చాలా పరిశోధనలు చేశామని, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిని కలిసి ఆమె గురించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. 
Related image
ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించి మెప్పించగలదని..పది సెకన్లలో వంద హావభావాలను పలికించగల గొప్ప నటి సావిత్రి అలాంటి మహానటి సినిమా తెరకెక్కిస్తుందన్నందుకు గర్వంగా ఉందని స్వప్నాదత్ చెప్పారు.  తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: