‘అజ్ఞాతవాసి’ టీమ్ అనుసరిస్తున్న స్ట్రాటజీ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈరోజు ఈసినిమా సంగీత దర్శకుడు అనిరుథ్ అని అంటున్నారు. ఈరోజు అనిరుధ్ ట్విటర్ ద్వారా ‘అజ్ఞాతవాసి’ లోని రెండవ పాట విడుదల కాబోతు ఉండటంతో ఈ పాట విషయంలో ‘అజ్ఞాతవాసి’ టీమ్ అనుసరిస్తున్న స్ట్రాటజీ పవన్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు అని టాక్.

‘అజ్ఞాతవాసి’ మొట్టమొదటి పాట ‘బయటకు వచ్చి చూస్తే’ స్మాష్ హిట్ అయిన నేపధ్యంలో ఈరోజు విడుదలకాబోతున్న పాట ‘గాలివాటుగ’ పై కూడ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇది పవన్ సినిమా అయినప్పటికీ ఈరోజు విడుదల కాబోతున్న ఈపాటకు సంబంధించి విడుదలచేసిన పోస్టర్లలో అనిరుధ్ ఫోటోను హైలెట్ చేస్తూ పోస్టర్లను విడుదల చేయడం పవన్ వీరాభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అని టాక్. 

సాధారణంగా పవన్ సినిమాకు సంబంధించి అతడి ఫోటోలను తప్పించి మరెవ్వరి ఫోటోలతో ఆమూవీ పోస్టర్లు ఉంటే పవన్ అభిమానులకు ఏమాత్రం రుచించదు. అంతేకాదు వారికి అసహనాన్ని కూడ కలిగిస్తుంది. ఇప్పుడు అదే సందర్భం అనిరుధ్ విషయంలో కూడ జరుగుతోంది.  అయితే అనిరుధ్ త్రివిక్రమ్ లకు మధ్య ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఇలా ‘అజ్ఞాతవాసి’ టీమ్ ప్రవర్తించి ఉంటుంది అని కూడ కొందరి భావన.

ఈసాన్నిహిత్యం వల్లనే అనుకోవాలి త్రివిక్రమ్ త్వరలో జూనియర్ తో తీయబోతున్న లేటెస్ట్ మూవీకి కూడ సంగీత దర్శకుడుగా తన బాధ్యతలను నిర్వహించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ మొట్టమొదటి పాట లక్షల సంఖ్యలో హిట్స్ తెచ్చుకున్న నేపధ్యంలో ఈరోజు విడుదల కాబోతున్న ఈ మూవీ రెండవ పాట ‘గాలివాటుగ’ పవన్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోతే ఇప్పటికే అసహనంగా ఉన్న పవన్ అభిమానులు అనిరుధ్ ను టార్గెట్ చేయడం ఖాయం..   


మరింత సమాచారం తెలుసుకోండి: