క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఇచ్చినన్ని టాప్ ఆడియో హిట్స్ గత దశాబ్ద కాలంగా ఏ సంగీత దర్శకుడు మన టాలీవుడ్ సినిమా రంగంలో ఇవ్వలేకపోయాడు. దీనితో టాప్ హీరోలు అంతా తమ సినిమా పాటలకు దేవీశ్రీప్రసాద్ తో ట్యూన్ చేయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. చిరంజీవి నుండి నేటితరం యంగ్ హీరోల వరకు ఎన్నో సినిమాల ఘన విజయం వెనుక దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ కీలకంగా పనిచేసింది. 

అయితే ఈమధ్య కాలంలో దేవిశ్రీ తన సినిమాలకు ఇచ్చే ట్యూన్స్ విషయంలో తిరిగి పాత ట్యూన్స్ నే వాడుతున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో దేవిశ్రీ హవా అయిపోయిందా అన్న అనుమానాలు వచ్చినా ఇప్పటికీ అందరి హీరోలకు నచ్చిన సంగీత దర్శకుడుగా దేవిశ్రీ కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ఇంచుమించు ఒకేసారి విడుదలైన ‘హలో’ ‘ఎం సి ఏ’ సినిమాలలోని పాటలు దేవిశ్రీ అనూప్ రూబెన్స్ ల మధ్య వార్ గా మారాయి. 

ఎంతమంది సంగీత దర్శకులు వచ్చినా దేవిశ్రీ ట్యూన్స్ అంటే యూత్ విపరీతంగా కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో ‘హలో’ ఆడియో పై దేవిశ్రీ పై చేయి సాధిస్తారు అని అనుకున్నారు అంతా. అయితే అనూహ్యంగా అనూప్ రూబెన్స్ ‘హలో’ మూవీకి ఇచ్చిన పాటల ట్యూన్స్ ఇప్పుడు యూత్ కు బాగా కనెక్ట్ కావడమే కాకుండా ఆడియో రేటింగ్స్ లో మొదటి స్థానంలో నిలుస్తోంది. 

దేవిశ్రీ ట్యూన్ చేసిన ‘ఎం సి ఏ’ పాటలు రొటీన్ ట్యూన్స్ గా మారడంతో నానీ సినిమాలోని పాటలు కన్నా అఖిల్ సినిమాలోని పాటలు బాగున్నాయి అంటూ అప్పుడే కామెంట్స్ మొదలైపోయాయి. దీనితో రాబోతున్న క్రిస్మస్ వార్ కు తలబడుతున్న అఖిల్ నానీల సినిమాల విషయంలో అప్పుడే అఖిల్ పై చేయి సాధించాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో నాగార్జున అనూప్ రూబిన్స్ పై పెట్టుకున్న నమ్మకం నిజమైంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: