ప్రముఖ నటి మరియు ఎంఎల్ఎ రోజా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిన్నరాత్రి ఒక ప్రముఖ ఛానల్ చర్చా క్రార్యక్రమంలో పాల్గొంటూ మధ్యలో పవన్ విషయం వచ్చే సరికి ఆవేశపూరితంగా తీవ్రమైన పదజాలంతో ఒకరి పై ఒకరు చేసుకున్న  బూతులయుద్ధం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలు-వారసత్వం అనే అంశం పై జరిగిన టీవీ9 బిగ్ డిబేట్ లో పాల్గొన్న వీరిద్దరూ చేసుకున్న అభ్యంతరకర వ్యాఖ్యలు విన్నవారంతా షాక్ అయిపోయారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ టైమ్ లో వెండితెరమీదకు వచ్చిన చిరంజీవి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చాలా కష్టపడ్డారని అంటూ అయితే ప్రస్తుతం ఆయన తమ్ముళ్లు కొడుకు మేనళ్లులు అల్లుడు కేవలం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారని కార్యక్రమంలో చర్చ జరుగుతుండగానే బండ్లగణేష్ పై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనికి మరింత రెచ్చిపోయిన బండ్ల గణేష్ రోజాను కూడ టార్గెట్ చేస్తూ చాల ఘాటైన కామెంట్స్ చేసాడు.

పవన్ గురించి రోజా ఒక కామెంట్ చేయబోతుంటే బండ్ల గణేష్ ఆమె మాటలకు అడ్డు వస్తూ ‘గోల్డెన్ లెగ్’ అంటూ వెటకారంగా సంబోధించాడు. దీనితో రెచ్చిపోయిన రోజా ‘పక్కనుండి పక్కలేసావా పవన్ కళ్యాణ్ కి’ అంటూ బండ్ల గణేష్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది. దీనితో సహనం కోల్పోయిన బండ్ల గణేష్ ‘నువ్వు స్ట్రెయిట్ గా హీరోయిన్ అయ్యావా’ అంటూ రోజాను ప్రశ్నించాడు దీనితో మరింత రెచ్చిపోయిన రోజా ‘పళ్ళు రాలుతాయిరా వెదవ’ అనడంతో ఆచర్చా కార్యక్రమం మరింత బూతు మాటలకు కేంద్రంగా మారింది. 
roja, bandla ganesh, tv9 debate, బండ్ల గణేష్, రోజా, అసభ్య పదజాలం, విమర్శలు, టీవీ9 చర్చ
ఒకవైపు ఈకార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కావడంతో జరుగుతున్న ఈబూతుల యుద్ధాన్ని ఆపడానికి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆఛానల్ ప్రతినిధి చాల కష్టపడవలసి వచ్చింది. అయితే ఈ కార్యకరమాన్ని చూస్తున్నవారు మాత్రం పవన్ కోసం వీరిద్దరు ఇలా మాటలతో యుద్ధం చేసుకోవడం ఏమిటి అంటూ ఆశ్చర్యపోయారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: