టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడో తెలియంది కాదు.  కొంత కాలంగా యాడ్స్ లో ఇద్దరూ మంచి జోష్ కొనసాగిస్తున్నారు.  అయితే నేషనల్ లెవెల్ లో మహేష్ బాబు కనిపించింది తక్కువే..ఇక రణవీర్ సింగ్ సినిమాల కన్నా యాడ్స్ లోనే ఎక్కువ నటించినట్లు కనిపిస్తుంది. 

మనోడు యాడ్స్ కూడా నేషనల్ లేవెల్ లో ఉన్నాయి.  తాజాగా మహేష్, రణవీర్ లు ఇద్దరూ కలసి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. రేసర్లుగా దుస్తులు ధరించి నటించిన సన్నివేశాలను నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ లో ఉంచారు. నాస్కార్ రేస్ ట్రాక్ లో థమ్స్ అప్ యాడ్ కోసం వీరు కలసి నటించారు.

ఈ షూటింగ్ లో తమ కుమారుడు గౌతమ్ కూడా పాల్గొన్నాడని నమ్రత పేర్కొన్నారు.నాస్కార్ రేస్ ట్రాక్ లో థమ్స్ అప్ యాడ్ కోసం వీరు కలసి నటించారు. ఈ షూటింగ్ లో తమ కుమారుడు గౌతమ్ కూడా పాల్గొన్నాడని నమ్రత పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: