అర్జున్ రెడ్డి మూవీ సాధించిన ఘన విజయంతో దర్శకుడు సందీప్ రెడ్డి టాలీవుడ్ సెలెబ్రెటీగా మారిపోయాడు. అంతేకాదు టాప్ యంగ్ హీరోలు అంతా సందీప్ రెడ్డి వినిపించే కథల వైపు ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి త్వరలో తీయబోయే సినిమా పై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. 

అయితే సందీప్ రెడ్డి మాత్రం తన అర్జున్ రెడ్డి మూవీని బాలీవుడ్ లో కొత్త తారలతో రీమెక్ చేసేపనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి రామ్ చరణ్ ఇంటిలో జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్ళడం అతడితో కలిసి ఫోటోలు తీయించుకోవడం హాట్ న్యూస్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు సందీప్ రెడ్డి శర్వానంద్ ద్వారా చరణ్ ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈమధ్య చరణ్ భార్య ఉపాసన తమ ఇంటిలో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసిన నేపధ్యంలో ఆ ఫంక్షన్ కు చరణ్ అర్జున్ రెడ్డిని పిలిచినట్లు టాక్. శర్వానంద్ యూవీ క్రియేషన్స్ విక్కీలతో కలిసి సందీప్ రెడ్డి కొంతసమయం చరణ్ ఇంట్లో సందడి చేయడమే కాకుండా ఒకవెరైటీ మల్టీ స్టారర్ కథను చరణ్ కు సందీప్ రెడ్డి వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే చరణ్ శర్వానంద్ లతో ఈమల్టీ స్టారర్ ను నిర్మించే ఉద్దేశ్యం సందీప్ రెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి మూవీతో సంచలనాలు సృష్టించిన ఈ యంగ్ డైరెక్టర్ తన మల్టీ స్టారర్ కోసం చరణ్ శర్వానంద్ లను కలపగలిగితే మరో భారీ మల్టీ స్టారర్ కు రంగం సిద్ధం అయినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: