పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌ మెంట్‌ తో కూడిన పోస్టర్ పై బండ్ల గణేష్ ట్విట్ పవన్ అభిమానులకు ఎంతో నచ్చడంతో ఆ ట్విట్ ను పవన్ అభిమానులు వేలసంఖ్యలో రీ ట్విట్ చేసారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ గిటార్ పట్టుకుని కిర్రాక్ లుక్‌ లో కనిపిస్తున్న నేపధ్యంలో బండ్ల గణేష్ తనదైన శైలిలో ట్విట్ చేసి మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాడు.

‘వామ్మో..వామ్మో.. ఓరి దేవు డో’ అంటూ తన దేవుడిగా భావించే బండ్ల గణేష్ మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. ఇది ఇలా ఉంటే ‘అజ్ఞాతవాసి’ ఆడియో రిలీజ్ పోస్టర్ కు పవన్ అభిమానులలో విపరీతమైన స్పందన వస్తోంది. పవన్ అభిమానులు మాత్రమే కాకుండా టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ కిర్రాక్ అంటూ ఈ పోస్టర్‌ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

ఇక 19న జరగబోయే ‘అజ్ఞాతవాసి’ మెగా ఈవెంట్‌ కు పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ కూడా హాజరౌతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కావాలని మెగా అభిమానులు అంతా కోరుకుంటున్నారు. అంతేకాదు ఈ ఆడియో ఈవెంట్ లో మెగా హీరోలు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్‌లు కూడా వస్తే వీరంతా ఒకే వేదిక పై చూస్తే బాగుంటుంది అన్న కలలలో ప్రస్తుతం మెగా అభిమానులు ఉన్నారు. 

అయితే పవన్ అభిమానులు కోరుకుంటున్న మాదిరిగా మెగా యంగ్ హీరోలు అంతా ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ కు రావడం కష్టమని ముఖ్యంగా ఈమధ్య పవన్ అల్లు అరవింద్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ రీత్యా అల్లు అర్జున్ కు అసలు ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించిన వ్యక్తిగత ఆహ్వానం అందుతుందా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యల పై రేగుతున్న మాటల దుమారంలో ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ లో పవన్ తన ఫై వస్తున్న విమర్శలకు ఏవిధంగా సమాధానాలు ఇస్తాడు అన్న ఆసక్తి అందరిలోనూ రోజురోజుకు పెరిగిపోతోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: