తమిళ మాస్క్ సినిమాతో పరిచయమైన పూజా హెగ్దె తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా అంతగా క్రేజ్ దక్కించుకోలేదు. ఇక బాలీవుడ్ లో మొహెంజోదారో సినిమా చేసిన ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం సినిమా చేశాక కాని హిట్ తలుపు తట్టలేదు. ఆ సినిమాలో బికీని అందాలతో అలరించిన పూజా అందుకు తగ్గ హాట్ ఇమేజ్ సంపాదించింది.


ఇక ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ భామ ఎకౌంట్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. త్రివిక్రం శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కలిసి చేస్తున్న సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేయడం ఆమె కెరియర్ కు ఎంతో సహకరిస్తుందని చెప్పొచ్చు.


జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో తారక్ ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా పూజాని ఫిక్స్ చేశారట. ప్రస్తుతం అమ్మడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సాక్ష్యం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.


మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అమ్మడు వరుస అవకాశాలతో దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. డిజెలో బికినితో అలరించిన అమ్మడు త్రివిక్రం సినిమాలో క్లాసీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుందని అంచనా వేయొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: