యుద్ధం శరణం ఫ్లాప్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న సవ్యసాచి సినిమా మీద జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ హీరో మాధవన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. తెలుస్తున్న సమాచారం ప్రకారం మాధవన్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు.


ముఖ్యంగా సినిమాలో యాంటీ హీరో రోల్ చేస్తున్న మాధవన్ తో నాగ చైతన్య చేసే సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాలో చైతుకి కొన్ని శక్తులు ఉంటాయట. కార్తికేయ, ప్రేమం సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన చందు మొండేటి ఈ సవ్యసాచి సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపిస్తాడని అంటున్నారు. 


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా నాగ చైతన్య కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచేలా ఉంటుందని తెలుస్తుంది. చందు మొండేటి వర్కింగ్ స్టైల్ ఆల్రెడీ ప్రేమం రీమేక్ తో అలవాటు పడిన చైతు సినిమాను ఈజీగా చేస్తున్నారట.


కొత్త పాయింట్ తో వస్తున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని చెబుతున్నారు. నాగ చైతన్య ఈ సినిమా తర్వాత మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: