టీమిండియా కెప్టెన్ బ్యాట్స్మెన్ అయినా విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ వివాహం అత్యంత వైభవంగా చాలా రహస్యంగా ఇటలీలో జరుపుకున్నారు. ఈ వేడుకకు అతి కొద్దిమంది మాత్రమే ఆహ్వానం అందింది .. ఈ వివాహాన్ని అత్యంత గోప్యంగా మీడియా కి కూడా ఎక్కడా లీక్ అవ్వకుండా జరుపుకున్నారు.
కోహ్లీ అనుష్క వివాహం కు సంబంధించి ఓ సంచలన కరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఇండియాకు చెందిన ఒక పురోహితుడు ఈ వివాహాన్ని జరిపించాడు అని ఇతడు పంజాబ్ రాష్ట్రంలో పుర్తల జిల్లా సాంధు చతా గ్రామానికి చెందిన పవన్ కుమార్ కౌశల్ అనే ఇతను వీరిద్దరికీ బ్రాహ్మణ వివాహం జరిపించాడు.
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే పవన్ కుమార్ కౌశల్ కు పెళ్లి మండపం దగ్గరికివెళ్లేవరకు తాను చేయబోయే వివాహం విరాట్ కోహ్లీ అనుష్క లదని తెలియదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 25 సంవత్సరాల నుండి చేస్తోన్న పెళ్ళిళ్ళ వలన రాని పేరు ప్రఖ్యాతులు విరాట్ అనుష్క లతో వచ్చిందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.ఈ క్రమంలో పెళ్లి మండపంలో విరాట్ అనుష్కను చూసి షాకయ్యానని అన్నారు.