తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినిమా నటులకు సంబంధించిన బయోపిక్ చిత్రాలు రాలేదు. ప్రస్తుతం తెలుగు తెరపై అలనాటి మహానటి సావిత్రి జీవితకథతో ఎవడే సుబ్రమాణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ ‘మహానటి’ చింత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు చలన చిత్రసీమను మకుటం లేని మహరాణిగా ఏలిన మహానటి చివరి దశలో ఏలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతున్నారు. ఆ కాలంలో షూటింగ్ లు ఎలా జరిగేవి. అసలు వాతావరణం ఎలా ఉండేది అనే విషయం అప్పటి వారికీ తప్ప ఇప్పటివారికి తెలియదు.
ప్రస్తుత రోజుల్లో మేకింగ్ సీన్స్ మనం చాలానే చూస్తున్నాం. మొబైల్స్ లో షూటింగ్ లను చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చూపిస్తున్నారు. కానీ అప్పట్లో ఒక సినిమా కెమెరా తప్ప మారేది ఉండేది కాదు. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా..సావిత్రితో సమానంగా పేరు తెచ్చుకున్న నటి జమున పాత్రలో సమంత నటిస్తుంది.
ఇక సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లో ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. తన సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అందులో షేర్ చేసుకుంటుంది సమంత. ఈ నేపథ్యంలో తాజాగా తన కొత్త బండి గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. సమంత ఫొటోను షేర్ చేస్తూ..1980 కాలానికి వెళుతున్నాం. ముఖ్యమైన వారి జీవిత చరిత్రలను తెలుసుకోవడానికి అర్హమైనవి.
అలాగే సావిత్రిగారి జీవిత కాలాన్ని మళ్లీ చూపిస్తుండడం అందులో నేను నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఇక మీరు చూస్తున్న ఈ కొత్త బండి ఎలా ఉందొ చెప్పండి అని సమంత తన అనుభూతిని తెలియజేశారు.