నాని హీరోగా నటిస్తున్న 'ఎంసీఏ’ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న వరంగల్ లో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. స్టేజీ మీద దిల్ రాజు ప్రసంగిస్తుండగా కొందరు అభిమానులు బాగా అల్లరి చేయడంతో దిల్ రాజు కాస్త ఆగ్రహానికి గురై ‘అరేయ్ ఏంది రా బై.. కొంచెం గమ్మునుండడ్రా...మనకు గిట్ల చెబితే కానీ అర్థం కాదా?' అంటూ తన ప్రసంగంలో సెటైర్లు వేసాడు.


 అయినా ఫ్యాన్స్ అల్లరి ఆగక పోవడంతో ‘ఏయ్ అర్థం కాదా? మాట్లాడనివ్వండి. మీరు ఇలా అల్లరి చేస్తే వరంగల్ లో ఫంక్షన్లు ఉండవు, షూటింగులు ఉండవు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగుల కోసం వరంగల్ వచ్చేలా ఉండాలి, మీరు ఇలా చేస్తే ఎలా? అంటూ దిల్ రాజు అసహనం వ్యక్త పరిచాడు. దీనితో పరిస్థితి చేయిదాటిపోతోంది అని గ్రహించిన నాని దిల్ రాజ్ చేతిలోని మైక్ ను తీసుకుని ‘రాజు గారు అలాగే చెబుతారు. ఆయన్ను మీరు పట్టించుకోవద్దు. హైదరాబాద్ నుండి వరంగల్ వచ్చి ఫంక్షన్ చేస్తుంది మీరు సైలెంటుటగా ఉంటారనా? ఈ రోజు ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి దొరుకుతున్న సపోర్టు చూస్తుంటే ప్రతీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయీ హీరో అయిపోయినంత ఆనందంగా ఉంది’ అంటూ తన అభిమానులకు మరింత జోష్ ను పెంచాడు.


 అంతేకాదు మీరందరు ఇంత కష్టపడి వచ్చి మౌనంగా కూర్చువడానికా అల్లరి చేయడానికే అంటూ మరో ట్విస్ట్ ఇచ్చి తన అభిమానులు తన పై చూపిస్తున్న ప్రేమకు ఎన్ని జన్మలెత్తినా ఋణం తీర్చుకోలేను అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.  ఇదే సందర్భంలో దిల్‌ రాజుతో తాను ఈ ఏడాది రెండు సినిమాలు చేసే అవకాశం దక్కింది అనిఅంటూ ఈ సినిమాతో సాయి పల్లవి తన అభిమాన నటి అయిపోయింది అంటూ కామెంట్స్ చేసాడు.


 దీనితో సాయి పల్లవికి నానీకి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయి అన్న వార్తలకు కూడ నాని చాల వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చాడు అన్న కామెంట్స్ వినిపించాయి. ఇదే సందర్భంలో నాని మాట్లాడుతూ ఈసినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం అని సంకేతాలు ఇవ్వడంతో ఈమూవీ పై నాని పెట్టుకున్న ఆశలను తెలియ చేస్తున్నాయి. దీనితో రాబోతున్న అఖిల్ తో వార్ కు నాని అన్ని విధాల సిద్ధపడుతున్నట్లే అనిపిస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: