ఈమధ్య కాలంలో టాలీవుడ్ ప్రముఖులు కూడ వారి ఇళ్ళల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను సెలెబ్రేట్ చేసుకోవడం ఒక కల్చర్ గా మారింది. గతంలో బాలీవుడ్ లో మాత్రమే కనిపించే ఈ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడ ప్రాకింది. ఈమధ్యనే రామ్ చరణ్ భార్య ఉపాసన తమ ఇంటిలో క్రిస్మస్ ట్రీ పెట్టి అందర్నీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.


 ఇప్పుడు ఇదే కల్చర్ అక్కినేని కాంపౌండ్ కు కూడ చేరువైంది. అయితే ఇప్పుడు జరగబోతున్న ఈ క్రిస్మస్ వేడుకలు నాగార్జునకు ఒక సమస్యగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా క్రిస్మస్ ను నిర్వహించేవారిలో అక్కినేని అమల కూడా ఉంటారు అన్న విషయం చాల తక్కువమందికి తెలిసిన విషయం.

 

అమల జరిపే క్రిస్మస్ వేడుకలకు అక్కినేని కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించడం ఆమె అలవాటు. ఇప్పుడు ఈ విషయంలోనే నాగార్జునకు ఒక సమస్య వచ్చి పడింది. ఈ ఏడాది సమంత అక్కినేని ఇంటికి కొత్త కోడలిగా ఎంట్రీ ఇచ్చిన నేపధ్యంలో రాబోతున్న క్రిస్మస్ రోజున అక్కినేని కుటుంబ సభ్యులకు ఒక పార్టీని ఇవ్వబోతోంది.

 

ఈసారి క్రిస్మస్ వేడుకను అందరం కలిసి జరుపుకుందాం రమ్మని అందరినీ అప్పుడే ఆహ్వానిస్తోందట సమంత. అయితే యథావిథిగా ఏటేటా మాదిరిగానే అమల కూడా క్రిస్మస్ బాష్ ఏర్పాటు చేస్తోంది. దీనితో ఏ పార్టీకి అటెండ్ అవాలో అర్థం కాని పరిస్థితి నాగార్జున ఇరుక్కున్నాడని నాగ్ స్వయంగా ఒక మీడియా సంస్థకు ‘హలో’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. దీనితో నాగార్జున తన కోడలు పార్టీకి వెళతాడా లేదా అమలను ఈసారికి సద్దుకోమని చెపుతాడా అంటూ ఈ న్యూస్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: