ఈ మద్య సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రోజా, నిర్మాత బండ్ల గణేష్ ల మద్య జరిగిన వివాదాస్పద వ్యాఖ్యలు పలు సంచలనాలు సృష్టంచాయి.  ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం శృతి మించే వరకు వెళ్లింది. అది కూడా లైవ్‌లోనే.  అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఏపీ ప్రతిపక్ష నేత పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రోజా ఆరోపిస్తున్నారు.  అయితే జగన్ ని పవన్ కళ్యాన్ ఏమీ అనలేదని ఆ పార్టీ వారే తప్పుగా అర్థం చేసుకున్నట్లు బండ్ల గణేష్ ఆరోపిస్తున్నారు.   

బండ్ల గణేష్‌ని ఈ విషయంపై వివరణ కోరుతూ.. ఒక ప్రజా నాయకురాలిని అలా అనడంపై మీరు రోజాగారికి క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించింది.  దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘నేనెందుకు క్షమాపణ చెప్పాలి. అందులో నా తప్పేం లేదు. ముందు ఆవిడే మాట జారారు. ఆ తర్వాత నేను అలా అనాల్సి వచ్చింది. రోజాగారిని పవన్ కల్యాణ్‌‌గారికి క్షమాపణ చెప్పమనండి. అప్పుడు నేను ఆవిడ కాళ్లు పట్టుకుని మరీ క్షమాపణ చెబుతా. లేదంటే నేను క్షమాపణ చెప్పాల్సినంత తప్పు ఏం చేయలేదు. 

అక్కడికీ నేను చాలా గౌరవంగా ఆమెను.. అమ్మా.. రోజాగారు.. అంటూనే సంభోదించా. ఆవిడ ఆవేశంతో మాట జారారు. ఆ తర్వాతే నేను కూడా ఆవేశంతో మాట జారాల్సి వచ్చింది. అంతే..’’ అంటూ బండ్ల గణేష్ మరోసారి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: