పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం నుండి మరో సర్‌ప్రైజ్ పోస్టర్ వచ్చేసింది. ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్న సీనియర్ నటి ఖుష్బూ తన ట్విట్టర్ ఖాతా నుండి ‘అజ్ఞాతవాసి’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఖుష్బూ, బొమన్‌ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతోంది.

తాజా పోస్టర్‌లో ఖుష్బూ కుర్చీలో కూర్చొని ధీరత్వాన్ని ప్రదర్శిస్తుంటే.. పవన్ ఆమె వెనుకనే నిలబడి ఉండటాన్ని బట్టి ఈ మూవీలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుస్తోంది.  టీజర్ లో కూడా ఖుష్బూకి సంబంధించి ఒక్క బిట్ మాత్రమే చూపించారు..అదీ వెనుకవైపు నుంచి.  తాజాగా ఇందులో ఖుష్బూ కుర్చీలో కూర్చొని కోపంగా చూస్తుంటే.. పవన్‌ ఆమె వెనుక నిల్చొని అంతే కోపంగా చూస్తున్నారు. దీని బట్టి ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Related image
ఇక భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీలో పవన్ సరసన అనుఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ 19న హైదరాబాద్‌లో జరిగే ఆడియో వేడుక కార్యక్రమంలో ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో మెగా హీరోలు అందరూ హాజరౌతారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: