అల్లు శిరీష్ హీరోగా విఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఒక్క క్షణం. ఈమధ్యనే టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఒక్క క్షణం సినిమాపై వస్తున్న కాపీ ఆరోపణలకు అల్లు శిరీష్ రెస్పాన్స్ ఇచ్చాడు.


తమ సినిమా ఏ సినిమాకు కాపీ కాదని వివరణ ఇచ్చారు. ప్యారలెల్ లైఫ్ కాన్సెప్ట్ ఆధారంగా కొరియన్ లో వచ్చిన సినిమా తెలుగు రీమేక్ కోసం 2 మేమిద్దరం అనే సినిమా వస్తుంది. అనీల్ సుంకర ఈ సినిమాను తెలుగులోకి తెస్తున్నారు. ఒక్క క్షణం మీద ఆ సినిమా ఎఫెక్ట్ ఉందని అన్నారు. కాని సినిమా చూస్తే మీకే అర్ధమవుతుందని అసలు ఈ సినిమాకు దానికి ఎలాంటి సంబంధం లేదని అన్నాడు శిరీష్. 


ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విఐ ఆనంద్ కూడా ఈ కాపీ అలిగేషన్స్ పై వివరణ ఇచ్చారు. నిన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 


లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ అందుకున్న శిరీష్ ఒక్క క్షణంతో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి న్యూ ఇయర్ గిఫ్ట్ గా డిసెంబర్ చివరి వారం రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: