ఎప్పుడూ ఎలట్రానిక్ మీడియా ఛానల్స్ పొలిటికల్ బ్రేకింగ్స్ నడిపితే, ఈ రోజు మాత్రం టాలీవుడ్,పొలిటికల్ రెండింటికి సంధించిన బ్రేకింగ్స్ను నడుపుతున్నాయి. పవన్ మూవీ అత్తారింటికి దారేది రిలీజ్కి ముందే నెట్లో హల్చల్ చేయడంతో నిర్మాతకు తీరని నష్టాన్ని చేకూర్చింది. అసలు ఈ వీడియోను ఎవరు అప్లోడ్ చేశారు. ఏవిధంగా జరిగింది వంటి విషయాలు ఇప్పుడు ప్రతి అభిమానిని వెంటాడుతున్న ప్రశ్న. మూవీకు సంబంధించిన ఫైనల్ ఎడిటింగ్ పూర్తి అయిన తరువాత, ఆ వీడియోను ఎడిటింగ్ రూమ్ నుండే ఎవరో బయటకు తీసుకుపోయారని క్లారిటికు వచ్చారు. దీనికి సంబంధించిన దర్వాప్తు ఇంకా కొనసాగుతుంది.
ఆ వీడియోను ఎడిటింగ్ రూం నుండి కొందరు నమ్మకమైన మనుషులే ఈ విధమైన దుశ్ఛర్యకు పాల్పడ్డారని టాలీవుడ్ అంటుంది. దీనికి సంబంధించిన అప్లోడ్ లింక్లు అమెరికా నుండి జరిగిందని మీడియా సమాచారం. కాని ఈ వీడియో లింక్ను ఇండియా నుండి అప్లోచ్ చేయడం జరిగిందని ఇప్పటి వరకూ ట్రేస్ చేసిన యు.ఆర్.ఎల్స్ అండ్ ఐ.పిల ద్వార తెలిసిసిందని టాలీవుడ్ సమాచారం. మొత్తంగా పవన్ మూవీ ఏ విధంగా బయటకు వెళ్ళింది అనే దాంట్లో ఒక క్లారిటికు వచ్చారు.