అత్తారింటికి దారేది లీక్డ్ మూవీను కేవలం ఎన్.ఆర్.ఐల కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియోను మొదటగా డైన్లోడ్ చేసుకుంది ఎన్.ఆర్.ఐలు. ఇండియన్ యూజర్స్ కంటే ఎన్.ఆర్.ఐ యూజర్లే ఎక్కువగా ఆ వీడియోను చూసినట్టు సమాచారం. మెగా పవర్స్టార్ రామ్చరణ్తేజ స్పందించిన తీరులో అదే తెలుస్తుంది. కేవలం యు.ఎస్ నెటిజెన్ల ఆనందం కోసం ఒక్కోసారి ఈ విధంమైన లీక్డ్ వీడియోలను పెట్టి, ఇండస్ట్రీకు బ్యాడ్ను క్రియోట్ చేస్తుంటారు. ఆ విధంగా చేసే వారిమీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రామ్చరణ్ తేజ డిమాండ్ చేశాడు.
రామ్చరణ్ తేజ స్పందిస్తూ, ఈ తరహా యాక్టివిటీస్ను ఏ మాత్రం ఎంకరేజ్ చేయకూడద అంటూ కామెంట్ చేశాడు. మొత్తనికి అత్తారింటికిదారేది లీక్డ్ మూవీను ఎక్కువుగా చూసింది ఎన్.ఆర్.ఐలే. ఎందుకంటే ఆ వీడియో రాత్రి సమయంలో అప్లోడ్ చేయబడినట్టు చెబుతున్నారు. ఇండియాలో అందరూ సండే మత్తులో ఉండగా ఉదయాన్నే న్యూస్ తెలిసేసరికి ఆ వీడియోను డిలీట్ చేశారు. ఎన్.ఆర్.ఐ లు మాత్రం చాలా స్పీడ్గా న్యూస్ను షేరింగ్ చేసుకొని వీడియోను వీక్షించటమే కాకుండా, డౌన్లోడ్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఎంతో మంది ఇండియన్స్కు ఆ వీడియోను షేరింగ్ ఇచ్చారు.