నిన్న టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసిన అత్తారింటికి దారేది పైరసీ వ్యవహారంతో అత్తారింటికి దారేది సినిమా నిర్మాత ఈ సినిమా ఎమర్జెన్సీ విడుదల చెయ్యడానికి సహకరించిన వ్యక్తులలో ప్రముఖంగా పవన్ కళ్యాణ్ పేరే బయటకు వస్తుంది. కొన్ని గంటల వ్యవధిలో ఈ పైరసీ వ్యవహారంతో ఈ సినిమాను కొనుక్కున్న చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను ఈనెల 27 వ తారిఖు నాడు విడుదల చెయ్యడానికి రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాల సెగతో పాటు ఈ పైరసీ వ్యవహారం వల్ల ఈ సినిమాకు జరిగిన తీవ్ర నష్టాన్ని సాకుగా చూపెట్టి ఈ సినిమాను ప్రొడ్యూసర్ ప్రసాద్ కోరిన విధంగా 27 న విడుదల చెయ్యలేమని చేతులేత్తేశారట.

ఈ పరిస్థితులలో అగమ్యగోచరంలో పడిపోయిన నిర్మాత ప్రసాద్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని విధాలా ధైర్యం చెపుతూ ఈ సినిమా ను కొనుక్కొని వెనక్కు వెళ్ళిపోయిన బయ్యర్లు ఉన్న ప్రాంతాలలో ఈ సినిమాను రిలీజ్ చెయ్యడానికి అల్లు అరవింద్, సురేష్ బాబు లను పవన్ వ్యక్తిగతంగా నచ్చజెప్పి ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఈ సినిమాకు ఈ సమైఖ్య ఉద్యమ సెగల వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టాన్ని నిర్మాత కు పూడ్చడానికి తాను నిర్మాత దగ్గర తీసుకున్న పారితోషికాన్ని కూడా తిరిగి ఇచ్చి వేస్తానని పవన్ నిర్మాత ప్రసాద్ కు అభయం ఇచ్చాడని టాక్.ఈ విధంగా పవన్ వ్యక్తిగతంగా రంగంలో దిగడంతో అత్తారింటికి దారేది సినిమాకు దారి దొరికిందని అంటున్నారు.

ఈ వార్తల నేపధ్యంలో అత్తారింటికి దారేది నిర్మాత గట్టేక్కాడు, పవన్ ఇరుకున పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ సాధిస్తే పవన్ కు ఇక తిరుగు లేదన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. మరి ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో ఈ శుక్రువారం 27వ తారిఖు తేలిపోతుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: