ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికి దారేది మూవీ లీక్డ్ వీడియో జ‌రిగి, అన్ని చోట్ల నుండి అయ్యేపాపం ప‌వ‌న్‌, పాపం నిర్మాత అంటూ సానుభూతి తెలుపుతుంటే అక్కడ మాత్రం క్షమాభిక్షల‌కు ఇది స‌మ‌యం కాదు, అంతా ష‌రామామూలే అని అంటుంది. ఇంతలా ప‌వ‌న్ మూవీపై విరుచుకుప‌డుతున్నది ఎవ‌రో కాదు. తెలంగాణ‌వాదులు. తెలంగాణ ప్రాంతంలో అత్తారింటికిదారేది మూవీ అడే స‌మ‌స్యేలేదంటున్నారు ఓయు జేఎసి నేత‌లు. విభ‌జ‌న ప‌ర్వం కొన‌సాగుతున్నప్పుడు చిరంజీవి ఇంకా స‌మైక్య రాగం ప‌లుకుతుండ‌టం ఏ మాత్రం మంచి ప‌ద్దతి కాదు. ఆయ‌న ప్యామిలీ మూవీల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో థియోట‌ర‌ర్లలో ప్లే చేయ‌టానికి వీలులేదు. ఒక వేళ షోను ప్రద‌ర్శస్తే ప‌రిస్థితులు తీవ్రప‌రిణామాలుగా మార‌తాయి అని జె.ఎ.సి అంటుంది. 

అయితే అత్తారింటికిదారేది లీక్డ్ మూవీను తెలంగాణ వాదులు న‌మ్మటం లేదు. ఇదంతా ఫేక్ డ్రామ అని కొట్టిప‌డేస్తున్నారు. మూవీను రిలీజ్ చేసుకునే ప్రయ‌త్నంలో ఈ విధ‌మైన డ్రామాను ఆడారు, అంత‌కు మించి అక్కడ ఏమి జ‌ర‌గ‌లేదంటున్నారు. ఓ ప‌క్క మూవీను ఎట్టి ప‌రిస్థితుల్లో రిలీజ్ చేసుకోవాల‌నుకుంటున్న నిర్మాత‌ల‌కు, ఓయు హెచ్చరిక‌లు నిద్రప‌ట్టనీయ‌డంలేదంట‌. ఈ స‌మ‌స్యస‌ను ఏదోక‌విధంగా రిలీజ్‌కు ముందు రోజు ప‌రిష్కరించుకోవాల‌ని చూస్తున్నారు చిత్ర యూనిట్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: