పవన్ కళ్యాణ్ అభిమానులు రేపటి సూర్యోదయం కోసం ప్రతి నిమిషం భారంగా గడుపుతూ గడియారం వంక చూస్తూ ఉంటే, అదే కోవలో హీరో నితిన్ కూడా రేపటి ఉదయం గురించి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. నితిన్ పవన్ వీరాభిమాని అన్న విషయం వేరే చెప్పనవసరం లేదు. ఈ వీరాభిమాని కి రేపు విడుదల కాబోతున్న ‘అత్తారింటికి దారేది’ మొదటి రోజు మార్నింగ్ షో ప్రేక్షకుల మధ్య కూర్చొని పవన్ అభిమానులతో ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలని కోరిక కలిగిందట. దానికోసం ఆర్టీసి క్రాస్ రోడ్ లోని సంధ్య ధియేటర్ ను ఎంచుకున్నాడు ఈ యంగ్ హీరో. దీనికోసం పూరి జగన్నాధ్ ను బ్రతిమాలి రేపు ‘హార్ట్ అటాక్’ షూటింగ్ కూడా కాన్సిల్ చేయి౦చుకున్నాడట. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్ లో ట్విట్ చేశాడు.

గతంలో నితిన్ ‘ఖుషి’ సినిమాను కూడా ఇలాగే పవన్ అభిమానుల మధ్య చూశానని, ఆ విషయాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నానని అంటూ రేపటి ఉదయం గురించి తలచు కుంటూ ఉంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటూ తన ట్విట్ లో పవర్ స్టార్ పట్ల తనకున్న వీరాభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు నితిన్. అయితే ఖుషి సినిమాకు నేటి అత్తారింటికి దారేది కి తేడా ఏమిటి అంటే, ఖుషి టైం కు నితిన్ హీరోగా అడుగుపెట్టలేదు, మరి నేటి అత్తారింటికి దారేది టైం కు నితిన్ టాప్ హీరో స్టేటస్ అందుకొని తన తండ్రి చేత పవన్ అత్తారింటిని కొనిపించిన ఆనందంతో ప్రేక్షకులతో సమానంగా రేపు సంధ్య ధియేటర్ లో అల్లరి చెయ్యబోతున్న నితిన్ హడావుడి చూడాలి అంటే మనం కూడా సంధ్య ధియేటర్ కు వెళ్ళాల్సిందే. రేపటి ఉదయం నితిన్ కు ఎంతటి కిక్ ఇస్తుందో చూడాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: