ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీ సాధించిన స‌క్సెస్‌కు కోళీవుడ్ ఇండ‌స్ట్రీ ఫిధా అయింది. కోలీవుడ్‌కి సంబంధించిన ఓ బ‌డా నిర్మాత, అత్తారింటికిదారేది మూవీను రిమేక్ చేయ‌టాన‌కి సిద్ధప‌డ్డాడు. అంతే కాకుండా ఈ మూవీ రిమేక్ హ‌క్కుల‌ను భారీ మొత్తంలో కొన్నట్లు స‌మాచారం. అత్తారింటికి దారేది మూవీ మొత్తం ప్యామిలి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో అంద‌రి ప్రేక్షకుల‌ను అల‌రిస్తుంది. అందుకే ఈ మూవీను ఎక్కువ మొత్తంలో ఆ నిర్మాత రిమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని కోలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ బ‌లంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఒక వారం రోజుల్లోనే బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

అయితే రిమేక్ హ‌క్కుల‌ను స్వాధీనం చేసుకున్న నిర్మాత చెబుతూ 'ఈ మూవీను కోలీవుడ్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ రిమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని' చెబుతున్నాడు. విజ‌య్‌కి ప్యామిలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీలు అంటే చాలా ఇష్టం. దీనికి సంబంధించిన ఫైన‌ల్ స్టేట్‌మెంట్‌ను త్వర‌లోనే వెల్లడిస్తాను అని నిర్మాత చెబుతున్నాడు. అత్తారిటికిదారేది మూవీ త‌మిళ‌నాడులోనూ భారీ క‌లెక్షన్స్‌ను కొల్లగొట్టింది. దీంతో ప‌వ‌న్ మూవీపై అంద‌రి హీరోల చూపు ఉంది. మ‌రికొంత మాత్రం ఈ మూవీ రిమేక్‌లో సూర్య బ్రద‌ర్స్ కూడ న‌టించే అవ‌కాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: