తెలుగు సినిమా రంగంలో కాకలు తీరిన హీరోల టాప్ లేపింది ఓ హీరోయిన్. ఆమెనే కావాలంటూ ఆశగా వెల్లిన మన హీరోలకు చుక్కలు చూపించింది. మీరు నా రేంజ్ కాదంటూ చెప్పకనే చెప్పేసింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇది టాలీవుడ్ లో ఇప్పడు మాంచి టాపిక్ అయింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు, బాలీవుడ్ ను బజాయిస్తున్న అనుష్క శర్మ. ఇంతకీ ఆమె ఎవరి టాప్ లేపిందనేది కూడా తెలుసుకోవాలనుందా.. వారెవరో కాదు తెలుగులో టాప్ హీరోలయిన ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు. ఇంత పెద్ద హీరోలు ఆమెను చూసి అంతగా అదిరిపోయారా.. అని ఆశ్చర్య పోతున్నారు కదూ.

నిజమే మహేశ్ బాబు  తీస్తున్న ‘ఆగడు’ సినిమా కోసం అనుష్క శర్మ నే హీరోయిన్ గా అడిగారట. అంతే కాదు జూనియర్ ఎన్టీఆర్ తాను తీయబోయే కొత్త సినిమాల్లో హీరోయిన్ కోసం ఆమెనే ఎంపిక చేయమంటే ఫిల్మ్ మేకర్స్ అడిగారట. అంతే కాదు హరీష్ శంకర్, అల్లుఅర్జున్ లతో తీస్తున్న కొత్త సినిమా కోసం కూడా అనుష్క శర్మనే హీరోయిన్ గా అడిగారట. అయితే ఆమె చెప్పిన రేటు, ఆమె ఇచ్చే కాల్ షీట్స్ చూసి అదిరిపోయి వెనుదిరిగి మరోకరిని ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు మన తెలుగోళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: