అక్కినేని కుటుంబం, దగ్గుపాటి కుటుంబాలు మొత్తం కలిసి ఒకరికొకరు పోటీ పడితే ఇంకేమైనా ఉందా, అది టాలీవుడ్ లో ఓ పెద్ద సంచలనం. కాని అదే జరగబోతోంది, ఈ రెండు కుటుంబాలు ఓ రెండు సినిమాలు తీస్తున్నాయి. తెలుగు సిని పరిశ్రమలో అత్యంత కీలకమైన ఈ రెండు కుటుంబాల అగ్రజులంతా కలిసి తీస్తున్న ఈ సినిమాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కినేని నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగచైతన్యలు కలసి ‘మనం’ అనే సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. అంతే కాదు దగ్గుపాటి రామనాయుడు, వెంకటేష్, రానా లు కలిసి ఓ సినిమా తీస్తున్నారు. రామనాయుడు ఎంతో కాలంగా కలలు కంటున్న ‘మెగులు’ సినిమా ఇది. ఈ సినిమా 2014 జనవరి నుంచి సెట్స్ పైకి వెలుతుందట. ఇలా అక్కినేని, దగ్గుపాటి వంశం అంతా కలిసి రెండు సినిమాలతో పోటీ పడితే గెలుపెవరిది అన్నది పక్కన బెడితే ఇవి ఎంత సెన్సేషన్ అవుతాయనే ఉత్కంఠ మాత్రం సినీ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే దగ్గుపాటి ఇప్పుడు ‘నేనేం చిన్న పిల్లనా’ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు, ఇది నవంబర్ 9న విడుదలకు సిద్దమవుతోంది. ఆతర్వాత వారి సొంత ప్రతిష్టాత్మక సినిమా వైపు పూర్తి దృష్టి సారిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: