రాంచరణ్ ను వెంకటేష్ అవమానించాడు అన్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. తూఫాన్, జంజీర్ సినిమాల ఫెయిల్యూర్ తో ఇప్పటికే దెబ్బతిని ఉన్న చెర్రీకి వెంకటేష్ నిర్వాకం షాకిచ్చిందంటున్నారు. దీంతో టాలీవుడ్ లో మంచి రికార్డు కొట్టేద్దామనుకున్న చరణ్ కు వెంకటేష్ ఇచ్చిన ఝలక్ ఆశని పాతమే అవుతుందన్నది టాలీవుడ్ టాక్. రాంచరణ్ క్రిష్ణవంశీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మల్టీ స్టారర్ సినిమా తీస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అత్యంత పవర్ ఫుల్ పాత్రంలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే టాలీవుడ్ లో బిగ్ టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో వెంకటేష్ తాను రాంచరణ్ తో నటించలేను అని చెప్పేసాడట. తన వయసేంటి, రాంచరణ్ వయసేంటి, నేను అతనికి అంకుల్ గా నటిస్తే నా స్టార్ డమ్ కు దెబ్బ తగులుతుంది, అందుకే నటించడం లేదు, మరొకరిని చూసుకోండి అంటూ దర్శకుడు క్రిష్ణ వంశీకి చెప్పేసాడట వెంకటేష్. దీంతో ఒక్క సారిగా వంశీతో పాటు చరణ్ కూడా షాక్ తిన్నారు. కారణం ఇప్పటికే వెంకటేష్, రాంచరణ్ ల కాంబినేషన్ దృష్టిలో పెట్టుకుని స్టోరి ఫైనల్ చేసాడు క్రిష్ణ వంశీ, ఇప్పుడు వెంకటేష్ కాదంటే స్టోరీనంతా మార్చాలి, అంతే కాదు వెంకటేష్ పాత్ర ప్రాధాన్యతను తగ్గించి రాంచరణ్ పాత్రనే మరింత పవర్ ఫుల్ గా తయారు చేయాలి, ఇదంతా ఇప్పుడెలా సాద్యం అంటూ తలపట్టుకున్నాడట క్రిష్ణవంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి: