టాలీవుడ్ లో అసలుసిసలైన స్టార్లుగా వెలిగిపోతున్న ఇద్దరి మద్య యుద్దం మొదలయింది, ఇందులో ఎవరు గెలుస్తారనే దానిపై అందరు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ యుద్దం వారి మద్య జరుగుతోంది టాలీవుడ్ లో నెంబర్ వన్ స్తానం కోసం. సరే టాలీవుడ్ లో నెంబర్ వన్ అని ఎప్పుడంటారు, వారు సాధించిన హిట్ల సంఖ్యను బట్టా, లేక వారు తీసుకుంటున్న రెన్యుమరేషన్ బట్టా అనేది అసలు ప్రశ్న. టాలీవుడ్ వర్గాలు మాత్రం వారికి పలుకుతున్న రేటు ను బట్టి నెంబర్ వన్ డిసైడ్ అవుతుంది అంటున్నారు. అంటే ఎవరికి ఎంత ఎక్కువ రెన్యుమరేషన్ ఆఫర్ వస్తుందో వారే నెంబర్ వన్. అయితే ప్రస్తుతం వారిద్దరు టాలీవుడ్ లో అందరి హీరోలకంటే ఎక్కువ అంటే దాదాపు 15 కోట్లు తీసుకుంటున్నారట. దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ల తర్వాత ఓ కార్పోరేట్ సంస్థ తాను తీయబోయే సినిమాలో మహేష్ కు 17 కోట్లకు ఆఫర్ ఇచ్చిందట. అంతే కాదు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది తర్వాత లేటెస్టుగా అంతే పెద్ద కార్పోరేట్ సంస్థ ఓ సినిమాకోసం పవన్ కు 18 కోట్లు ఆఫర్ ఇచ్చిందంటున్నారు. అంటే కోటి ఎక్కవతో నెంబర్ వన్ దక్కించుకుంటాడేమో పవన్ అంటున్నారు. ఇది తెలిసి మహేష్ కూడా అంతకంటే ఎక్కువ అడిగి, అందులో సక్సెస్ అయితే స్థానం అటుది ఇటు అవుతుంది. అందుకే నెంబర్ వన్ కోసం వారిద్దరి మద్య యుద్దం జరుగుతోందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: