రామ్ చరణ్ ‘ఎవడు’ కు వచ్చినన్ని కష్టాలు టాలీవుడ్ లో మరే సినిమాకు వచ్చి ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తరువాత నాలుగు నెలలకు ఫైగా ల్యాబ్ లో పడుకున్న టాప్ హీరో సినిమాగా ‘ఎవడుకు’ అరుదైన రికార్డు ఉంది. రాజకీయ ఉద్యమాల నేపధ్యంలో నలిగిపోయిన ‘ఎవడు’ కు చివరకు వచ్చేనెల డిసెంబర్ 19న మోక్షం కలుగుతున్నట్లుగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజ్ నిన్న అధికారకంగా ప్రకటించారు.  ఇన్ని గండాలు దాటిన ‘ఎవడు’ కు మరో చిన్న సినిమా సమస్య మొదలైంది. ఈ సినిమా ప్రిన్సు, మహంత్ కధానాయకులుగా రూపొందిన ‘బన్నీ అండ్ చెర్రీ’ ఈసినిమా కధాంశం కూడ కొద్దిగా ఎవడు సినిమా కధను పోలి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అదీ కాకుండా రామ్ చరణ్ ను చెర్రీ అని అల్లుఅర్జున్ ను బన్నీ అంటు ముద్దుగా అటు టాలీవుడ్ లోను ఇటు మెగా అభిమనులలోను పిలుస్తూ ఉంటారు కాబట్టీ ఇదే పేర్లతో డిసెంబర్ లోనే ఈసినిమా కూడ విడుదల కావడం దిల్ రాజ్ కు చికాకు కలిగిస్తోందట.  అదీకాక ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ అల్లుఅర్జున్ లు కలిసి నటిస్తూ ఉండటంతో ఆ హీరోల ముద్దు పేర్లతో మరో చిన్న సినిమా విడుదల కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా టైటిల్ మార్చమని ఇప్పటికే ప్రయత్నించి విఫలమైన దిల్ రాజ్ ఈ సినిమా విడుదలను ‘ఎవడు’ సినిమా తరువాత వచ్చేటట్లుగా ఆ నిర్మాతలతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నాడు అంటు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో భారీ సినిమాగా నిర్మాణం అయిన ‘ఎవడు’ ఒక చిన్న సినిమాతో చికాకులు పడటం ఒక నాటి తెలుగు సామెతను గుర్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: