టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా రెండు భారీ సినిమాలు ఒకేసారి ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అయినప్పుడు ఒక సినిమా పబ్లిసిటీని మించి మరో సినిమాకు పబ్లిసిటీ చేస్తూ సూపర్ హిట్ అందుకోవాలని ఆ సినిమాల నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ రాబోతున్న సంక్రాంతికి మహేష్ నటిస్తున్న ‘1’ సినిమాకు పోటీగా విడుదల కాబోతున్న రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా పబ్లిసిటీ విషయంలో ప్రస్తుతం దిల్ రాజ్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం టాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది.  ఇప్పటికే పబ్లిసిటీ విషయంలో మహేష్ ‘వన్’ చాలా ముందుగా ఉన్న నేపధ్యంలో ‘ఎవడు’ పబ్లిసిటీ గురించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా మౌనంగా ఉంటున్న దిల్ రాజ్ ప్రవర్తన వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. మొన్న దసరా పండుగకు విడుదలైన ‘రామయ్యా వస్తావయ్యా’ ఘోర పరాజయం చెందండంతో దిల్ రాజ్ తన పబ్లిసిటీ ప్లాన్ ను మార్చుకుని ‘ఎవడు’ విషయంలో ఎవరూ ఊహించని విధంగా దిల్ రాజ్ అమలు పరుస్తున్నాడని టాలీవుడ్ టాక్.  గత భారీ సినిమాల చరిత్రను పరిశీలిస్తే ఒకే సారి రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు విపరీతమైన పబ్లిసిటీతో వచ్చిన సినిమా కంటే తక్కువ పబ్లిసిటీతో వచ్చిన సినిమాలు విజియవంతం అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే రకరకాల కారణాలతో విడుదల అనేక సార్లు వాయిదా పడ్డ ‘ఎవడు’ పై విపరీతమైన అంచనాలు పెంచకుండా తక్కువ పబ్లిసిటీతో సంక్రాంతి పోటీలో విజేతగా నిలవాలని దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్ వేసాడు అంటు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజ్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.   

మరింత సమాచారం తెలుసుకోండి: