అభిమానులే తన ప్రాణం అని భావించే చిరంజీవి అది నిజమని మరోసారి రుజువు చేసుకోబోతున్నారు. ఏసమవేశమైనా, ఏ ఫంక్షనైనా తన బలం, తన ధనం నా అభిమానులే అని ఉధ్ఘాటించే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా తన అభిమానులంటే ఇప్పటికి తన ప్రాణం అంటారు. అభిమానుల తర్వాతే ఏదైనా అనే చిరంజీవి తనకోసం వస్తూ అనంతలోకాలకు వెల్లిపోయిన అభిమాని సంతాపసభ కోసం శుక్రవారం బెంగ్లూరుకు వెలుతున్నారు. తనకు తన చెల్లె పెళ్లికి రమ్మని ఆహ్వానం ఇవ్వడానికి వస్తూ పాలెం బస్సు ప్రమాదంలో మరణించిన కర్ణాటక మెగా ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షడు, దివంగత కోటె వెంకటేష్ యాదవ్ సంతాప సభ శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని టౌన్ హాలులో జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు, అల్లు అరవింద్ కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువజన శాఖ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు ఆర్ వీ దేవరాజ్, జమీర్ అహమ్మద్ హాజరవుతున్నట్లు సమాచారం. గత ఏడాది అక్టోబరు 29న తన సోదరి అనితతో కలిసి జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సు ప్రమాదంలో కోటె వెంకటేష్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇటీవల వెంకటేష్ కుటుంబ సభ్యులను కలిసి చిరంజీవి సోదరుడు నాగబాబు రూ.5 లక్షలు కూడా అందించారు. దీంతో చిరంజీవి తన అభిమానులంటే తనకెంత ఇష్టమో మరో సారి రుజువుచేసుకోబోతున్నారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: