ప్రస్తుత కాలంలో యూత్ ఎంత త్వరగా ప్రేమించుకుంటున్నారో, అంతే త్వరగా విడిపోతున్నారు. బ్రేక్ అప్ ను కూడా ఈవెంట్ గా భావించే ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ కు అనుగుణమైన కథాంశాన్ని న్యూ డైమన్షన్ స్క్రీన్ డైమన్షన్ స్ర్కీన్ ప్లేతో తెరకెక్కిస్తున్న చిత్రం బ్రేక్ అప్. ఈ సినిమాలో రణధీర్ (హ్యపీడేస్, బాణం చిత్రాల ఫేం), స్వాతీ దీక్షిత్ (తొలి పరిచయం) జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కాగా, ఈ బ్రేక్ అప్ సినిమాకు అమర్ కామేపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అమర్ కామేపల్లికి ఇదే తొలి సినిమా. ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ బ్రేక్ అప్ సినిమాలో సీనియర్ నటుడు సురేష్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కొత్త తరహా స్క్రీన్ల్ తో తెరకెక్కుతున్న ఈ బ్రేక్ అప్ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: