రెబెల్ స్టార్ కృష్ణంరాజు చాలా సంస్కార వంతంగా మాట్లాడతాడు అనే పేరు ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కృష్ణంరాజు తన అభిమానుల ఎదుట ప్రతిస్పందించి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఈ మధ్య ప్రభాస్ గురించి షాకింగ్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఈ రూమర్లు ఎందుకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు.ఈ మధ్య మళ్ళీ ‘బాహుబలి’ షూటింగులో గాయపడ్డ ప్రభాస్ కొమాలోకి వెళ్లారనే కొన్నివదంతులు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ వదంతులపై ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు.  అభిమాను సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభాస్‌పై ఇలాంటి వదంతులు సృష్టిస్తున్న వారిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. ఇలాంటి వదంతుల వల్ల దిష్టి పోతుందని అన్నారు. ఇదే సందర్భంలో కృష్ణంరాజు మాట్లాడుతూ ‘బాహుబలి’ నిర్మాణం తరువాత ప్రభాస్ పెళ్లికొడుకు అవుతాడని ప్రకటించారు  అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి షూటింగులో పాల్గొంటున్నాడని, ఎలాంటి పుకార్లను అభిమానులు నమ్మొద్దని పిలుపునిచ్చారు కృష్ణంరాజు. ఈమధ్యనే మళ్ళీ భారతీయ జనత పార్టీలో చేరిన కృష్ణంరాజు రాబోతున్న ఎన్నికలలో పోటీచేసి తన సత్తాను చాటాలని అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు గా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: