దర్శకుడు కృష్ణవంశి రామ్ చరణ్ తో తీస్తున్నలేటెస్ట్ మల్టి స్టారర్ ఫై ఒక ఆశక్తి కర కధనం వినిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం 'మురారి' సినిమా నచ్చని వారు ఉండరు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఆచిత్రం మహేష్ బాబు కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. అంతే కాదు మహేష్ కు నంది అవార్డును కూడా అందించింది.  దానితో ఇప్పుడు మళ్లీ అలాంటి చిత్రమే రామ్ చరణ్ తో కృష్ణవంశీ తీస్తున్నాడంటు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రారంభం జరిగింది అన్న విషయం తెలిసిందే  క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గ రూపొందుతున్నఈసినిమా షూటింగ్ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన తరువాత 40 రోజులపాటు రామేశ్వరం, నాగర్‌కోయిల్, పొల్లాచ్చిలో షూట్ చేస్తామని ఈ సినిమా యూనిట్ వారు అంటున్నారు.  ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఏది ఏమైనా ఒక నాటి మురారి లాంటి సాఫ్ట్ స్టొరీ ని నేటి యవతరం ముఖ్యంగా చరణ్ అభిమానులు అంగీక రిస్తారా అన్నదే ప్రశ్న?    

మరింత సమాచారం తెలుసుకోండి: