మెగా బ్రద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శక‌త్వంలో ఆయ‌న తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. రేపు మహా శివరాత్రి రోజున ఈ చిత్రానికి ఈ నెల 27న కొబ్బరికాయ కొడుతున్నారు. మార్చి నెలాఖ‌రి నుంచి సెట్స్‌పైకి తీసుకెళ‌తార‌ని స‌మాచారం. అయితే `గొల్లభామ‌` పేరుతో గోదావ‌రి నేప‌థ్యంలో సాగే ఓ క‌థ‌ని తెర‌పై చూపిస్తార‌ని ప్రచారం సాగింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా పేరు మార‌బోతోందని అంటున్నారు `గొల్లభామ‌` అనే పేరుమెగా అభిమానుల‌కు న‌చ్చేలా లేద‌ని, అందుకే ఇంకో పేరు సూచించాల‌ని మెగా క‌థానాయ‌కులు శ్రీకాంత్ అడ్డాలకు సలహా ఇచ్చారట ఈ మేరకు సరి కొత్త పేరును ఆలోచించే ప‌నిలో ఉన్నాడట శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకు “ఆరడుగుల బుల్లెట్” టైటిల్ బాగుంటుందని బన్ని సూచించి నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ఒక ప్రముఖ నిర్మాత ఇప్పటికే రిజిస్టర్ చేసి ఉండటంతో ఆ నిర్మాతతో దర్శకుడు శ్రీకాంత్ మంతనాలు జరుపు తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఠాగూర్ మ‌ధు, న‌ల్లమ‌లుపు బుజ్జి నిర్మిస్తున్నారు. 27న రామానాయుడు స్టూడియోలో జరిగే ఈ సినిమా ప్రారంబోత్సవానికి మెగా కథానాయకులంతా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక రేపు మీడియా కెమెరాలకు బిజీ బిజీ అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: