స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తొడల పై శ్రుతిహాసన్ కూర్చుని ఉన్న ‘రేసుగుర్రం’ పోస్టర్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ పోస్టర్ లో బన్నీ తొడల పై ధ్యానం చేస్తూ శ్రుతిహాసన్ కనిపిస్తోంది. అయితే ఒక పాటలో వచ్చే సన్నీ వేసంగా ఈ పోస్టర్ కనపడుతున్నా అసలు శ్రుతి ఒక రొమాoటిక్ సాంగ్ లో బన్నీ తొడల పై ధ్యానం చేస్తూ ఎందుకు కూర్చుంది అంటు బన్నీ అభిమానులే కాకుండా దర్శకుడు సురేంద్ర రెడ్డి క్రియేటివిటీ గురించి టాలీవుడ్ లోని చాలామంది దర్శకులు ఈ పోస్టర్ పై కామెంట్స్ చేయడం వినపడుతోంది. మొదటగా ఈ సినిమా ఆడియోను చాల ఘనంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించినా ప్రస్తుతం మెగా కుటుంబంలో జరుగుతున్న పరిణామాల రీత్యా ఈ సినిమా ఆడియోను రేపు ఎటువంటి హడావిడి లేకుండా మీడియా ప్రతినిధుల ఎదురుగా విడుదల చేయబోతున్నారు.  మొదట్లో ఈ సినిమా బాలయ్య ‘లెజెండ్’ తో పోటీ పడుతుందని భావించినా ‘లెజెండ్’ కు పెరిగి పోతున్న క్రేజ్ రీత్యా ఈ సినిమాను ఏప్రియల్ 4వ తారీఖున విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని టాక్. గత సంవత్సరం బన్నీకి సరైన హిట్ లేకపోయిన నేపధ్యంలో ఈ ‘రేసుగుర్రం’ పై బన్నీ చాల ఆసలు పెట్టుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: