బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవర హీరోకు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. సౌత్ హీరోల తడాఖా ఏంటో తెలిసొచ్ఛేలా చేశారు అరవ హీరో అభిమానులు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ను ఎపిహెరాల్డ్‌.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్, సౌత్ టాలెంటెడ్ హీరో సూర్య మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న అంజాన్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కరీనాకపూర్ స్పంధించింది. అయితే తను స్పంధించిన తీరే బాగాలేదని సూర్యా అభిమానులు నానా గొడవ చేశారు. ''సూర్య ఎవరో నాకు తెలియదు. అధారం లేని న్యూస్ ను ఎవరో క్రియోట్ చేస్తున్నారు. అంజాన్ మూవీ సంగతి కూడ నాకు తెలియదు'' అంటూ కరీనాకపూర్ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీంతో కరీనాకపూర్ పై సూర్య అభిమానులు వద్ద నుండి ఒత్తిడి పెరిగింది. తోటి యాక్టర్ ను గౌరవించడం రాని కరీనాకు, ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగే అర్హత లేదంటూ సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో షూటైన విమర్శలు వస్తున్నాయి. దీంతో బిటౌన్ కూడ కరీనా స్టేట్ మెంట్ పై నెగిటివ్ టాక్ వచ్చిఇంది. దీంతో వెంటనే కరీనా మరోసారి క్లారిటి ఇచ్చింది. ''సూర్యా అంటే నాకు తెలుసు. కాని అంజాన్ మూవీలో నేను ఐటెం సాంగ్ చేయడం లేదు. సూర్యా తమిళ్ ఇండస్ట్రీలో టాలెండెట్ హీరో. తను బాలీవుడ్ లో మూవీ చేస్తే తనతో పనిచేయటానికి నేను సిద్ధమే. ప్రస్తుతం నేను హింధీలో సింఘం2 మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను'' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసరికి అభిమానులు కూల్ అయ్యారు. కరీనా కపూర్ స్టేట్ మెంట్ కు సూర్యా అభిమానులు ఫైర్ అవ్వటం సమంజసమేనా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: