పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ తన చిన్నతనం నుండీ చాల స్పీడ్ అనిచేపుతుంది. ఆ స్పీడ్ వల్లే కాబోలు గత సంవత్సరం చార్మీ ఒక టాప్ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చింది అనే వార్తలు కూడా హడావిడి చేసాయి. ఛార్మీ టాలీవుడ్ లోకి ప్రవేసించి అప్పుడే 50 సినిమాలు పూర్తి చేసిందంటే చాలామంది నమ్మరు. అటువంటి డేరింగ్ అండ్ డేషింగ్ చార్మీ నిన్న ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ఆశక్తికర విషయాన్నీ చెప్పింది. తన చిన్నప్పట్నించీ కూడా తనను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకునే తత్వం కాదు అని అంటు ఇండస్ట్రీలో కూడా అలానే ఉంటాను కాబట్టి అనవసరంగా తన దగ్గరకి వచ్చి ఎవరూ వేరే విధంగా మాట్లాడరు అని అంటున్నది ఛార్మీ. శ్రీఆంజనేయం సినిమా చేస్తున్నప్పుడు ఒకసారి మేకప్ సామాను కొనుక్కోవడం కోసం తన తల్లిని తీసుకుని షాపుకి వెళ్లిందట చార్మే ఈలోపున ఫోన్ వస్తే మాట్లాడదామని బయటకు వచ్చిన చార్మీని బజారులో ఒక వ్యక్తి గట్టిగా నెట్టుకుంటూ వెళ్లాడట దీనితో తిక్కరేగిన ఛార్మీ పరిగెత్తుకెళ్లి ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టిందట.. దానితో ఆవ్యక్తికి ఛార్మీ కొట్టిన దెబ్బలకు అతడికి తాగిన మత్తు దిగిపోయింది అని చెపుతోంది ఈ ప్రతిఘటన హీరోయిన్. సమాజం మారాలని మాటలు చెప్పడం కాకుండా ముందు మన చుట్టూ ఉన్న వాళ్లలో మార్పు తీసుకొస్తే తరువాత సమాజంలో మార్పు దానంతటదే వస్తుంది అని గట్టి నమకంతో చెపుతోంది ఛార్మీ. ఆమె తాజా చిత్రం 'ప్రతిఘటన' గురించి చెప్తూ ఒరిస్సాలో ఒక అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది అని అంటు వాస్తవ కథకి కొంత రాజకీయాన్ని కలిపి తీసిన ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకుంది చార్మీ..  

మరింత సమాచారం తెలుసుకోండి: