రేణుదేశాయ్ మొట్టమొదటి సారిగా పవన్ కళ్యాణ్ తో తన భంధం గురించి మీడియాతో మాట్లాడుతూ పవన్ పై తనకున్న ప్రేమానురాగాలను మరోసారి వ్యక్త పరిచింది. పవన్ తో రేణు విడిపోయిన తరువాత ఒక పబ్లిక్ ప్లాట్ ఫాం పై మాట్లాడటం ఇదే మొదటిసారి. తన దృష్టిలో పవన్ అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్య్హి అని అంటూ ఒక నిజమైన మానవతా వాదానికి నిలువెత్తు నిదర్సనం పవన్ జీవితమని ఆమె అభిప్రాయపడ్డారు. అంతే కాదు తాము ఎందుకు విడిపోయామో తమ ఇద్దరికే తెలుసు అని అంటూ ఈ విషయాలను తెలుసుకునే హక్కు ప్రపంచంలో మరెవ్వరికీ లేదు అని అంటోంది రేణు. తాను ప్రస్తుతం పవన్ కు దూరంగా ఉన్నా పవన్ నిజాయితీని సమాజం పట్ల పవన్ కు ఉన్న సామజిక స్పృహను ఇంకా తాను గౌరవిస్తూనే ఉన్నాననీ రేణు అభిప్రాయ పడుతోంది. మంచి వ్యక్తులు సమాజానికి కావాలి అని కోరుకునే వారందరూ పవన్ లాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తారానీ అంటు అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు నేటి సమాజానికి అవసరం అంటు పవన్ పై ప్రసంసల జల్లు కురిపిస్తోంది రేణు. మరో ప్రక్కన తన ఫేస్ బుక్ కు వచ్చిన అసభ్యకర సందేశాల గురించి స్పందిస్తూ ఈ సందేశాలు పంపిన వ్యక్తులు పవన్ అభిమానులు కారనీ కొంతమంది టాప్ హీరోల అభిమానులనీ అని అంటు సెలెబ్రెటీల అభిమానులు తమ విలువైన కాలాన్ని ఇలా వృధా చేసుకోకుండా సమాజం గురించి తమ కెరియర్ గురించి ఆలోచిమ్చుకాలని హితబోధ చేస్తున్న రేణు లేటెస్ట్ పవన్ భజన వెనుక కారణాలు ఏమిటో రానున్న కాలంలో తెలియాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: