మొన్నటి మొన్న లెజెండ్ మూవీ సక్సెస్ మీట్ లో అందరి ముందు గొడవకు దిగిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ, డైరెక్టర్ బోయపాటి శ్రీను ల రభసను ఇంకా మరువక ముందే, ఇప్పుడు వీరిద్దరి మధ్య మరో గొడవ మొదలైందని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిక సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం మేరకు బోయపాటి శ్రీను, దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య గొడవ మరింత పెద్దది అయిందంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ వద్దకు వచ్చే ప్రాజెక్ట్స్ లో ఓ హీరో సంబంధించిన ప్రాజెక్ట్ ను దేవిశ్రీ నుండి థమన్ వద్దకు వెళ్ళేలా బోయపాటి చేశాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం దేవిశ్రీ కు తెలిసినా చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకుంటున్నా, బోయపాటి మాత్రం దేవిశ్రీ గురించి పలు చోట్ల, పలు విధాలుగా మాట్లాడుతున్నట్టు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న మాట. దీంతో వీరిద్దరి మధ్య తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుందని అంటున్నారు. లెజెండ్ మూవీ మ్యూజిక్ చాలా బాగా ఇద్దామని దేవిశ్రీ అనుకోగా, బోయపాటి శ్రీను చాలా విషయాల్లో దేవిశ్రీను తీవ్రమైన ఇబ్బంది పెట్టడంతో, మరింత నాణ్యమైన మ్యూజిక్ ను దేవిశ్రీ అందిచలేకపోయాడని టాలీవుడ్ టాక్. మొత్తానికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బోయపాటి, దేవిశ్రీల మధ్య జరిగే గొడవ, చాలా రసవత్తరంగా సాగుతుందని అంటున్నారు. దేవిశ్రీ, బోయపాటి ల గొడవకు కారణం ఏమిటి? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: