టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసి మెల్లగా సక్సెస్‌లు అందుకుంటూ టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా శ్రియ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు స్టార్‌ హీరోల అందరి సరసన నటించిన శ్రియ కోలీవుడ్‌లో కూడా తనదైన ముద్రను వేయగలిగింది. ఈ అమ్మడు తమిళంలో రజనీకాంత్‌ సరసన నటించిన ‘శివాజీ’ చిత్రంతో హాలీవుడ్‌ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు తాజాగా ఫెయిల్యూర్స్‌తో సహవాసం చేస్తోంది. హీరోయిన్‌గా ఎన్నో సక్సెస్‌ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లో నటించే అవకాశమే రావడం లేదు. ప్రస్తుతం ఈమె నటించిన అక్కినేని ‘మనం’ చిత్రం తప్ప మరే చిత్రం కూడా లేదు. ఆ చిత్రంలో అయినా శ్రియది చిన్న పాత్ర మాత్రమే అని తెలుస్తోంది. శ్రియకు ‘మనం’పై పెద్దగా ఆశలు ఉన్నట్లు లేవు. ఇక ఆ చిత్రం తర్వాత శ్రియ ఇక కనిపించడం కష్టమే అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ అమ్మడు కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతుంది. ఆ మధ్య తెలుగులో ‘పవిత్ర’గా వచ్చి తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వేశ్య పాత్రలో నటించిన శ్రియ ఆ చిత్రంలో అందంలో అవదులు లేకుండా నటించినా కూడా సక్సెస్‌ దక్కలేదు. అయితే తాజాగా అదే చిత్రంను తమిళంలో డబ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనార్థన మహర్షి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర’ చిత్రంలో సాయికుమార్‌, కౌశిక్‌బాబు ముఖ్యపాత్రల్లో నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంను ఒకే సారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని భావించారు. కాని అనుకోని కారణాల వల్ల ఒక్క తెలుగులో మాత్రమే విడుదల చేయాల్సి వచ్చింది. అయితే ఆ చిత్రం ఫెయిల్‌ అవ్వడంతో తమిళంలో విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంను తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘ఎన్‌ పెయిర్‌ పవిత్ర’గా తమిళంలో విడుదల చేయబోతున్నారు. మరి వేశ్యగా పవిత్ర అందాలు తమిళ తంబీలకు అయినా నచ్చుతాయో చూడాలి. ఈ చిత్రం సక్సెస్‌ అయితే ఈ ముదురు సుందరికి ఆఫర్స్‌ వస్తాయి అని ఆశపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: