మెగా హీరోలు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ల మధ్య పోటీ ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు అల్లు అర్జున్‌కు అందనంత దూరంగా చరణ్‌ ఉంటూ వస్తున్నాడు. అయితే తాజాగా అల్లు అర్జున్‌ రికార్డులు బ్రేక్‌ చేస్తూ చరణ్‌ కంటే ముందు నిలిచాడు. ఈ ఇద్దరు హీరోలు కూడా మెగా హీరోలే కావడంతో పెద్దగా రికార్డుల చర్చ అభిమానుల్లో జరగడం లేదు కావున బయటకు తెలియడం లేదు. అల్లు అర్జున్‌ ‘రేసుగుర్రం’లా వచ్చి చరణ్‌ రికార్డులను ఒక్కటి ఒక్కటిగా అధిగమిస్తూ దూసుకు పోతున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘ఎవడు’. రామ్‌చరణ్‌, శృతిహాసన్‌ జంటగా నటించిన ఆ చిత్రంలో అల్లు అర్జున్‌, కాజల్‌లు గెస్ట్‌రోల్స్‌లో కనిపించారు. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ‘ఎవడు’ చిత్రం మొదటి మూడు రోజుల్లో 21.65 కోట్ల షేర్‌ను సాదించి అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇంత మొత్తం సాధించడం ఇప్పట్లో ఎవరి వల్లా కాదు అని నిర్మాత దిల్‌ రాజ్‌ గతంలో ఒక సారి కూడా అన్నాడు. అయితే ఆ రికార్డును స్టైలిష్‌స్టార్‌ అధిగమించాడు. అల్లు అర్జున్‌, శృతిహాసన్‌ జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నల్లమల్లపు బుజ్జి, వెంకటేశ్వరరావులు సంయుక్తంగా నిర్మించిన ‘రేసుగుర్రం’ చిత్రం ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ దూసుకు పోతుంది. మొదటి మూడు రోజుల్లోనే ‘ఎవడు’ చిత్రం షేర్‌ను క్రాస్‌ చేసి 22.65 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుని ఇప్పట్లో సాధ్యం కాదు అని భావించిన రికార్డును బన్నీ బ్రేక్‌ చేశాడు. ఈ చిత్రం ఇక్కడే కాకుండా కేరళ, తమిళనాడు, ఓవర్‌సీస్‌లలో కూడా దూకుడుగా దూసుకు పోతుంది. కేరళాలో అక్కడి స్టార్‌ హీరోల స్థాయిలో కలెక్షన్స్‌ వసూళ్లు చేస్తోంది. ఇక ఓవర్‌సీస్‌లో కూడా చరణ్‌ కంటే ముందే బన్నీ ఉన్నాడు. ‘1’, ‘అత్తారింటికి దారేది’ చిత్రంల తర్వాత మూడవ స్థానంలో ‘రేసుగుర్రం’ నిలిచింది. విడుదలైన మొదటి మూడు రోజుల్లో 6 కోట్లకు పైగా ఓవర్‌సీస్‌ కలెక్షన్స్‌ రాబట్టాడు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: