జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా? అవుననే అంటున్నాయి పవన్ సన్నిహిత వర్గాలు. రాబోతున్న ఎన్నికలలో పవన్ సన్నిహితుడు పొట్లూరివరప్రసాద్ విజయవాడ లోక్ సభ స్థానంనుండి పోటీచేసే విషయంలో పట్టుదలగా ఉండటంతో ఆయననకు పోటిచేసే విషయంలో పవన్ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.  కొద్దిసేపటి క్రితం పవన్ తో పొట్లూరి కలిసి ఈవిషయమై సుదీర్ఘ చర్చలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టిడిపితో విభేదాల నేపథ్యంలో జనసేన పోటీపై పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పొట్లూరితో పాటు మరో ఏడుగురు అభ్యర్థులను స్వతంత్రంగా అసెంబ్లీ బరిలోకి దింపే ఉద్దేశంతో పవన్ సన్నిహితులు ఉన్నారు అని అంటున్నారు.  టిడిపి, బిజెపి అభ్యర్థుల తరఫున పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో పవన్ కోరిన ఒకే ఒక్క కోరికను చంద్రబాబు మన్నించక పోవడం పవన్ సన్నిహితులు చాల తీవ్రంగా ఫీల్ అవుతున్నారని అని టాక్. అయితే ఈవిషయం పై ఆవేశంగా నిర్ణయం తీసుకోవద్దని కొందరు పవన్ దగ్గర వాదిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్తితులే ఏర్పడితే తాను మద్దతిచ్చిన పొట్లూరి వంటి వారి స్థానాల్లో మాత్రం పవన్ బిజెపి, టిడిపిలకు వ్యతిరేకంగా ప్రచారం చేయవలసి వస్తుంది. ఏమైనా ఈ విషయం పై ఈ సాయింత్రానికి క్లారిటీ వస్తుంది అనే అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: