సింహా, లెజెండ్ మూవీలో బోయపాటి శ్రీను, బాలక్రిష్ణ కాంబినేసన్ చాలా బలపడిందని ఇండస్ట్రీ టాక్. అది ఎంతలా అంటే బాలక్రిష్ణకు ఎవరు ఎన్ని విధాలుగా కథలు చెబుతున్నా, బోయపాటి శ్రీను చెప్పిన కథలా, బాలయ్యకు కిక్కును ఇవ్వటం లేదు. దీంతో బోయపాటి శ్రీను అంటే బాలక్రిష్ణ అత్యంత ప్రీతి పాత్రుడుగా అయ్యాడని టాలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే లెజెండ్ సక్సెస్ మీద బాలక్రిష్ణ, బోయపాటి శ్రీను ఓ పెద్ద గిప్ట్ ను ఇచ్ఛాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. 'సింహా', 'లెజెండ్' సినిమాలతో బంపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుపై బాలకృష్ణకు అభిమానం మరింత పెరుగుతోంది. దీంతో తన వందో సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను బోయపాటికే అప్పగించాడు బాలయ్య. అంతే కాదు తాజాగా మరో ఆఫర్ ఇచ్చాడు. బాలకృష్ణ కుమారుడు 'మోక్షజ్ఞ'ను టాలీవుడ్ తెరంగేట్రం చేయించే బాధ్యతను కూడా బోయపాటికే ఇచ్చాడట. అయితే మోక్షజ్ఞను ఎవరి చేతుల్లో పెట్టాలా..?' అని గత కొంతకాలంగా బాలయ్య ఆలోచిస్తున్నాడట. ఇక తాజాగా తనకు లెజెండ్ తో సూపర్ హిట్ ఇచ్చిన శ్రీనునే బెస్ట్ ఛాయిస్ అని ఈ నందమూరి హీరో ఫిక్స్ అయ్యాడని టాలీవుడ్ టాక్. దీనికి తోడు 'లెజండ్' చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, వారాహి చలనచిత్రం సంస్థల నిర్మాతలకు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. మరి దీనిలో నిజమెంతో గానీ.. ఇప్పుడీ వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: