పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయాడు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు సంబంధించిన ఓ రూమర్ ను ఓ వర్గం వారు తెగ ప్రచారం చేస్తున్నారని తెలుసుకొని, అందుకు తగిన విధంగా పవన్ కళ్యాణ్ వారికి బుద్ధిచెప్పాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ న్యూస్ ను ఎపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 మూవీ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే ఉద్ధేశంలో లేడని గత పది రోజులుగా పవన్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల మధ్య కొందరు బలంగా వాదిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఎలక్షన్స్ అనంతరం షూటింగ్ లో పార్టిసిసెట్ చేస్తాడు అని చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం. గబ్బర్ సింగ్2 కు పనిచేస్తున్న టెక్కిషియన్స్ ను డైలమాలో పడేసి, వారిని ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకునేలా చేయాలని కొంత మంది విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ దగ్గరకు రావడంతో, వీటిపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నాడని తెలిసింది. రీసెంట్ గా గబ్బర్ సింగ్2 మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని పవన్ తన ఆఫీస్ నుండి కాల్ చేయించి ‘మాటలు అదుపులో పెట్టుకోవాలని’ అన్నట్టు టాలీవుడ్ సమాచారం. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని చూస్తూ ఉపేక్షించేది లేదని నిశ్ఛయించుకున్నాడు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఈ విధమైన వార్నింగ్ ను వేరే వ్యక్తులకు ఇచ్చాడని టాలీవుడ్ అంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీలకు దూరంగా ఉండి, రాజకీయాలపై ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు ఎవరు? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: