బాలీవుడ్ మూవీస్ లో నటించాలంటే అందరికీ క్రేజ్ ఎక్కువే. ఎక్కువగా కోలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ హిందీ చిత్రాల్లో నటించాలని ఆశపడుతుంటారు. ఎందుకంటే.. ఇక్కడ క్లిక్ అయిన హీరోయిన్లపై భారతీయ సినిమానే కాదు.. ప్రపంచ సినిమా దృష్టి కూడా పడుతుంది. అందుకే కాజల్, తమన్నా, శృతి హాసన్, ఇలియానా లాంటి టాలీవుడ్ భామలు బాలీవుడ్ లో నటించి తమ సత్తాచూపారు. ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మరో హీరోయిన్ బాలీవుడ్ కు వెళ్లనుందని సమాచారం. 'అలా మొదలైంది' చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసిన నిత్యా మీనన్ కూడా బాలీవుడ్ బాట పట్టడానికి సిద్ధపడుతోంది. ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు అంతగా లేకపోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ఈ బొద్దుగుమ్మ భావిస్తోంది. అయితే నాని, నిత్యా జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అలా మొదలైంది' చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. పనిలో పనిగా ఈ రీమేక్ లో కూడా నిత్యామీనన్ నే హీరోయిన్ గా తీసుకోవాలని నందిని ప్లాన్ చేస్తోందట. హీరోగా బాలీవుడ్ ఓ యంగ్ హీరోను తీసుకోనే ఛాన్స్ ఉంది. ఈ రీమేక్ లో నటించేందుకు నిత్యా కూడా ఓకే చెప్పిందని టాలీవుడ్ టాక్. టాలీవుడ్ నుంచి వెళ్లిన ముద్దుగుమ్మలలో ప్రస్తుతం ఇలియానా ఒక్కతే బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. మరి ఈ బ్యూటీని బాలీవుడ్ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: