సంగీత దర్శకుడు తమన్ రామ్ చరణ్ కు మెగా షాక్ ఇద్దామని రంగం సిద్దం చేసుకుంటున్నాడు అంటు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా నుండి తమన్ ను తప్పించడాన్ని ఈ సంగీత దర్శకుడు ఇప్పటికీ జీర్ణించు కోలేకపోతున్నాడు అని టాక్.  అల్లుఅర్జున్ ‘రేసుగుర్రం’ కలక్షన్స్ సునామి సృస్టిస్తున్నా బన్నీ తమన్ గురించి సక్సస్ మీట్లో ఒక్క మాట కూడ తన గురించి చెప్పకపోవడం తమన్ ఆగ్రహాన్ని మరింత పెంచింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో మెగా కుటుంబానికి తన సత్తా ఏమిటో చూపెట్టడానికి మహేష్ ‘ఆగడు’ సినిమాను వేదికగా చేసుకోవాలని తమన్ భావిస్తున్నాడట. మహేష్ ‘ఆగడు’, చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ ఈ రెండు సినిమాలు ఇంచుమించు దసరా పండుగ సీజన్ లో రాబోతున్నాయి కాబట్టి తన పాటల విశ్వరుపాన్ని చూపెట్టడానికి ‘ఆగడు’ సినిమా కోసం తమన్ చాల కసిగా కష్టపడుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తమన్ పాటలలో కొత్తదనం ఉండటంలేదని అదేవిధంగా రీ రికార్డింగ్ విషయంలో కూడ ఏమాత్రం తన క్రియేటివిటి చూపెట్టలేకపోతున్నాడు అన్న విమర్శకుల ప్రశ్నలకు నిజంగానే తమన్ సమాధానం ఇవ్వ గలడా అన్న విషయం ‘ఆగడు’ లో తెలియనున్నది.  ఇప్పటికే అనేకమంది యువ సంగీత దర్శకులు టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్న నేపధ్యంలో తమన్ కు నడుస్తున్నది పరీక్షా కాలమే అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: