వెండి తెర మన్మధుడు నాగార్జునకు తన తండ్రి అక్కినేనితో విపరీతమైన ఎటాచ్ మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ నాగ్ ఓ ఫోటోని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పెట్టి హడావిడి చేస్తున్నాడు. ఈ విషయం గురించి నాగార్జున ట్వీట్ చేస్తూ...తాను మనం సినిమా ఫొటోలు చూస్తూంటే తన తండ్రితో ‘మనం’ షూటింగ్ స్పాట్ లో తీయించుకున్న ఆఖరి ఫోటో కనిపించగానే తన తండ్రి తన కళ్ళ ముందు మెదిలారు అంటు తన భావాలను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంటున్నాడు నాగార్జున. ఇప్పటికే ఎన్నో అంచనాలు పెంచుతున్న ‘మనం’ సినిమా కోసం అక్కినేనిని గుర్తుకు చేస్తు ‘ప్రేమ్ నగర్’ సినిమాలోని ‘నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది’ పాటను నాగ చైతన్యా, నాగార్జునల మీద రీమిక్స్ సాంగ్ గా తీసి మధ్యలో గ్రాఫిక్ టెక్నిక్ లతో ఈ పాటలో మళ్ళీ అక్కినేని స్టెప్స్ వేసినట్లుగా చిత్రీకరించారు అనే వార్తలు వస్తున్నాయి. నటుడుగా తన జీవితం చివరి వరకు నటిస్తూ మరణిస్తాను అని చెప్పినట్లు అక్షరాలా చేసిన అక్కినేని నట జీవితానికి ఘనమైన వీడ్కోలుగా నాగార్జున ‘మనం’ సినిమాను తీర్చి దిద్దుతున్నాడు.నాగ్ తో సమానంగా సూట్ వేసుకుని అక్కినేని మరణించడానికి కొన్ని రోజుల ముందు తీసిన ఈ ఫోటో వెబ్ మీడియాలో అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: