టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క కాంబినేషన్ ఏర్పడితే, మూవీ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతాయి. అయితే నాగచైతన్య స్టార్ట్ చేసిన మూవీకు డైరెక్టర్ చెప్పుకోదగ్గ అవుట్ పుట్ ఇవ్వలేకపోవటంతో వెంటనే షూటింగ్ ను ఆపి డైరెక్టర్ ను మార్చేశాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గాడ్ ఫాదర్ లేక చాలా మంది సినిమాల్లోకి రాలేకపోతున్నారు. కానీ భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు కొందరు టాలీవుడ్ యంగ్ హీరోలు. ఈ లిస్ట్ లో అటు.. ఇటుగా నాగచైతన్య కూడా చేరతాడు. అక్కినేని రెండో వారసత్వంగా వచ్చిన చైతూ ఇప్పటి వరకు భారీ హిట్ కొట్టింది లేదు. అతను నటించిన ఏం మాయ చేసావే, '100%లవ్' మాత్రమే చెప్పుకోదగ్గ హిట్లు. తన లాస్ట్ సినిమా 'తడాఖా' యావరేజ్ గానే మిగిలింది. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన 'ఆటోనగర్ సూర్య' రిలీజ్ డేట్ పై పులు మార్పులు. దీంతో ఏడాది కాలం ఒక్క సినిమా కూడా లేకుండా నాగచైతన్య ఇబ్బంది పడుతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం చైతూ సినీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఇదిలా ఉంటే.. గతంలో చైతూ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 'దుర్గ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈచిత్రం కొన్నికారణాలతో ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. క్లాస్ లుక్స్ ఉన్న చైతన్యకు మాస్ సినిమాలు సెట్ కావనే టాక్ ఉంది. ఇమేజ్ కోసం చేసిన సినిమాలు భారీ ప్లాప్ లను ఇచ్చాయి. మళ్లీ 'దుర్గ' సినిమాతో అదే మిస్టేక్ చేస్తున్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలను డీల్ చేయలేడని పేరు తెచ్చుకున్న శ్రీనివాస రెడ్డితో చైతూ 'దుర్గ' అనే మరో మాస్ మూవీకి ఓకే చెప్పాడు. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత అవుట్ పుట్ అనుకున్నట్టుగా రావడం లేదని షూటింగ్ ను నిలిపివేశారని సమాచారం. ఇప్పుడు ఇదే మూవీను మరో డైరెక్టర్ తో చైతన్య తీద్ధామని , అందుకు తగ్గట్టుగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు టాలీవుడ్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: