మొన్నటి వరకూ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఆడుతూ పాడుతూ మూవీలు చేసిన ఆ జంట , ఇప్పుడు ఒకరిపై ఒకరు చిర్రుబుర్రులాడుకుంటున్నారు. వీరిద్దరే సమంత, ప్రిన్స్ మహేష్ బాబు. వన్ మూవీ పోస్టర్ పై సమంత ఎప్పుడైతే కామెంట్ చేసిందో, అనాటి నుండి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా మహేష్ తన అప్ కమింగ్ ఫిల్మ్ లో సమంతను తీసుకోవద్దని డైరెక్ట్ గానే నిర్మాతలకు సుచించాడట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. వివాదాలకు గాసిప్స్ కు దూరంగా ఉండే మహేష్ తన హీరోయిన్స్ విషయంలో కూడా చాలా పద్ధతిగా ఉంటాడు.
అలాంటి మహేష్ మణిరత్నం తీయబోతున్న మల్టీస్టారర్లో సమంతను తీసుకోవద్దని చెప్పాడట. ఇప్పుడు ఈ వార్త కోలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనితోనే ఈ మల్టీ స్టారర్ సినిమాలో అసిన్ పేరు బయటకు వచ్చింది అని అంటున్నారు. దూకుడు, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాల్లో మహేష్బాబు సరసన సమంత నటించింది. ఈ రెండూ బాక్సాఫీసు దగ్గర హిట్ కావడంతో వీరి కాంబినేషన్ హిట్ పెయిర్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు సమంత.. మహేష్ చిత్రం 'వన్' మూవీ పోస్టర్పై కామెంట్ చేసి తీవ్ర దుమారం రేపింది. ఈ సంఘటనతో సమంతకు టాలీవుడ్లో మద్దతు పెరగడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి, చివరకు క్షమాపణలు కూడా చెప్పేశాడు మహేష్.
అయితే ఆ విషయం అక్కడితో అయిపోయిందనుకున్నారు. కానీ మహేష్ గుర్తు పెట్టుకున్నాడట. మణిరత్నం మల్టీ స్టారర్ విషయంలో చిత్రయూనిట్ సమంతను మహేష్ సరసన తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఒక్కసారిగా ఫైర్ అయిన ప్రిన్స్ ఆలస్యం చేయకుండా సమంత కాకుండా మరొక హీరోయిన్ ను తీసుకోవాలని సూచించాడట. దాంతో శృతిహాసన్ మహేష్ సరసన నటిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: