జూనియర్ ఎన్టీఆర్ ను కమర్షియల్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ వివాదాల్లోకి లాగాడు అనే న్యూస్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. గత కొద్ది కాలంగా ఎన్టీఆర్ ను ఒక్క హిట్ కూడా వరించడం లేదు. ఎన్నో ఆశలతో తీసిన 'రామయ్యా వస్తావయ్యా' భారీ డిజాస్డర్ గా మారింది. దీంతో తాజాగా నటించబోయే సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టాడు ఎన్టీఆర్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రభస'ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రం తర్వాత యంగ్ టైగర్ .. 'ఆంధ్రావాలా' వంటి భారీ ఫ్లాప్ ఇచ్చిన పూరీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు జూనియర్. అయితే తాజాగా వీరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం టైటిల్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ''కుమ్మేస్తా'', అనే పేరు పెట్టినట్లు టాలీవుడ్ సమాచారం. ఈ టైటిల్ తో పాటు ''కుమ్ముతా'' అనే టైటిల్ కూడా చెబుతున్నాడట పూరీ. కానీ ఈ రెండు టైటిల్స్ తో 'కుమ్మేస్తా' అయితే సబ్జెక్ట్ కు, ఎన్టీఆర్ ఇమేజ్ కు సరిపోతుందని భావిస్తున్నాడట. ఏదేమైనా ఈ రెండు టైటిల్స్ కూడా అతని ఇమేజ్ కు ఏ మాత్రం సరిపోవంటున్నారు. ఎన్టీఆర్ కు మహిళా అభిమానులు తక్కువ. మరి ఇలాంటి టైటిల్స్ తో వస్తే ఇక ఉన్న కొద్దిమంది కూడా అతనికి దూరం అవుతారనే టాక్ వస్తోంది. అలాగే ఈ టైటిల్ తో మూవీను రిలీజ్ చేయడం కూడ చాలా కష్టంగా ఉంటుందని కొందరు అంటున్నారు. కాదని టైటిల్ ను పెట్టుకుంటే ఎన్టీఆర్ కచ్ఛితంగా వివాదాల పాలవ్వటం ఖాయం అని టాలీవుడ్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: