ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం అవుతున్న సినిమాల లో మంచి సినిమాలను టెలికాస్టింగ్ రైట్స్ కోసం ఎంచుకోవడం టీవీ ఛానల్స్ కు ఒక పరీక్ష గా మారింది. ప్రస్తుత పరిస్థితులలో చిన్న సినిమా పేరు చెబితేనే టీవీ ఛానల్స్ వారు రివర్స్ గేర్ లో వెనక్కు వెళ్ళిపోతున్నారు. చిన్న సినిమాలకు ప్రకటనలు దొరకక ఆ తరువాత తమ టీవీలో రేటింగులు రాక పోవడంతో భారిగా నష్ట పోతున్నాయి చానల్స్.  ఈ పరిస్థితి పెద్ద సినిమాలకు కుడా రావడంతో చేతులు కాల్చుకోవ‌డం పరిపాటిగా మారడంతో సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాతే కొనుక్కుంటున్నారు ఛానల్స్ యాజమాన్యాలు. అయితే లేటెస్ట్ గా నిఖిల్ - స్వాతి జంటగా వస్తున్న ‘కార్తికేయ’ సినిమా శాటిలైట్ భారీ రేటుకు అమ్ముడుపోవడం ఫిలింనగర్ లో సంచలనంగా మారింది. ఇప్పటికే షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమా శాటిలైట్ హ‌క్కులను జెమిని టీవీ 1.40 కోట్ల‌కు కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్‌ ఇందులో నటిస్తున్న నటీనటుల క్రేజ్ తో చూస్తే ఇది చాల మంచి రేట్ అని అంటున్నారు.  ఇదే కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘స్వామిరారా’ సినిమా హిట్ట‌వ్వ‌డంతో ఈ రేట్ పలికింది అని అంటున్నారు. అయితే ఈ సినిమాకు ఇంత సీన్ ఉందా అంటు సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: